పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) తో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli). ఎస్ఎస్ఎంబీ 29గా యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రానుందీ సినిమా. ఈ ప్రాజెక్టును మహేశ్ బాబు అధికారికంగా ప్రకటిస్తూనే..ఈ ఏడాది చివర్లో లాంఛింగ్ ఉండబోతుందని తెలిపాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ప్రస్తుతం స్క్రిప్ట్ పనులపై ఫోకస్ పెట్టారట. ఆయన రాజమౌళితో ప్రతీసారి టచ్లో ఉంటూ స్క్రిప్ట్ పనులు చేస్తున్నారట. త్వరలోనే రాజమౌళి మొదటి డ్రాఫ్ట్ను వినిపించబోతున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ మూవీ 2022లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో కథ ఉండనుందని ఇప్పటివరకు వినిపిస్తున్న టాక్.
కాగా పాపులర్ దక్షిణాఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ నవలల నుంచి ఈ చిత్ర కథను సేకరిస్తున్నారని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ..విల్బర్ స్మిత్ నవలలను స్ఫూర్తిగా తీసుకోనున్నారట. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పనులు పూర్తయిన తర్వాత మహేశ్ బాబు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు జక్కన్న.
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?