మేడ్చల్,మే 6: కరోనా కట్టడికి ఇంటింటి సర్వే చేపట్టి ప్రతి కుటుంబసభ్యుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం అధికారులు, వైద్యసిబ్బందితో కలిసి జ్వర సర్వేను ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లల్లో ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టాయి.మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశవర్కర్లు,అంగన్వాడీ టీచర్లు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్యసిబ్బంది, ఆశవర్కర్లు, ఆర్పీలతో బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరం, దగ్గు, జలుబు, ఇతరత్రా కొవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే కొవిడ్ వచ్చి,హోంఐసోలేషన్లో ఉన్న వివరా లు కూడా తీసుకున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లను అందించి, హోంక్వారంటైన్ ఉండే విధంగాఅవగాహనకల్పిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
మేడ్చల్ మున్సిపాలిటీలో మున్సిపల్ వర్కర్, ఏఎన్ ఎం, ఆశవర్కర్, ఆర్పీలతో కలిపి ఆరు బృందాలు ఏర్పా టు చేసి ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ బృందాలు మున్సిపాలిటీ పరిధిలో 650 ఇండ్లను సర్వే చేయగా అం దులో 31 మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించి మెడికల్ కిట్లను అందజేశారు.
మేడ్చల్ మున్సిపాలిటీలో నిర్వహించిన సర్వేను అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పరిశీలించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఏ ఒక్కరూ కూడా మిస్కాకుండా ప్రణాళికబద్ధంగా సర్వే నిర్వహించాలని సర్వే బృంద సభ్యులను ఆదేశించారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి మెడికల్ కిట్లను అందజేసి, అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కీసర,మే6: కీసర మండలంలోని పలు గ్రామాల్లో ప్రా థమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు కలిసి ఇంటింటా జ్వరం సర్వేను నిర్వహించారు. మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో 18బృందాలు సర్వే చేపట్టాయి. ఏడు మందికి కరో నా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, వారికి కరోనా కిట్లను అందజేశారు.
మేడ్చల్ కలెక్టరేట్, మే 6: నాగారం మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 7సర్వే బృందాలు 501ఇండ్లను సర్వే చేశా రు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 18 వార్డుల్లో 407 ఇండ్లలో సర్వే నిర్వహించగా 18మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న సర్వేను నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కమిషనర్లు వాణి రెడ్డి, స్వామి పరిశీలించారు.
ఘట్కేసర్,మే 6: ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలలో అధికారులు, సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. పోచారం మున్సిపాలిటీలో 8 బృందాలు 832 ఇండ్లలో సర్వే చేపట్టారు.ఈ సందర్భంగా జలుబు, జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రజలకు ఆరోగ్య సిబ్బంది మందులను అందజేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలో 12 బృందాలు 568 ఇండ్లను సర్వే చేశారు. కమిషనర్లు సురేశ్, వసంత, మేనేజర్లు నర్సింహులు, శ్రీధర్రెడ్డి సర్వేను పరిశీలించారు.
ఘట్కేసర్ రూరల్, మే 6: ఘట్కేసర్ మండలంలోని పలు గ్రామాల్లో సర్వే నిర్వహించినట్లు ఎంపీడీవో అరుణ తెలిపారు.మండల పరిధిలోని గ్రామాల్లో 13వైద్య బృం దాలు పర్యటించి 979 ఇండ్లలో ఫీవర్ సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సర్వేలో 50 మంది పాజిటివ్ ఉన్నట్లు గుర్తించి, వారికి కరోనా కిట్లను అందించి జాగ్రత్తలు వివరించినట్లు తెలియజేశారు.
మేడ్చల్ రూరల్, మే 6: మేడ్చల్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీలు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో చేపట్టిన జ్వర సర్వేలో భాగంగా ఒక్కో గ్రామంలో ఒక్కో బృందం నిర్వహించగా, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరు బృందాలు సర్వే నిర్వహించాయి. గుండ్లపోచంపల్లిలో 1488 కుటుంబాలను సర్వే చేయగా మొత్తం 45 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించగా, 22 మంది కొవిడ్ సోకినట్టు గుర్తించారు.
పీర్జాదిగూడ, మే6: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో 7బృందాలను ఏర్పాటు చేసి ఆయా డివిజన్లలో నగరపాలక సంస్థ అధికారులు, ఆరోగ్య సిబ్బందితో కలిసి 1920 మందిని సర్వే నిర్వహించారు.మొత్తం 49 మంది కి పాజిటివ్ ఉన్నట్లు గుర్తించి వారికి కిట్లను అందజేశారు.
శామీర్పే,మే6: ప్రజలు ఫీవర్ సర్వేకు సహకరించాలని ఎంపీపీ ఎల్లూబాయిబాబు, వైద్యులు సత్యంబాబు సూచించారు. శామీర్పేట ప్రాథమిక ఆర్యోగ కేంద్రం ఆధ్వర్యంలో పొన్నాల్, మజీద్పూర్ గ్రామాలతో పాటు ప్రతి గ్రామంలో ఫీవర్ సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగాఫీవర్ సర్వే అధికారులు ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి ప్రాథమిక దశలోనే మెడిసిన్ కిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు మోహన్రెడ్డి, సుకన్య, ఉపసర్పంచ్లు కుమా ర్, రమేశ్, వార్డు సభ్యులు, సిబ్బంది, పాల్గొన్నారు.
ఇంటింటి జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలి. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి గుర్తించేందుకు ఇంటింటికీ చేపడుతున్న జ్వర సర్వే కోసం వచ్చిన సభ్యులకు దగ్గు,జ్వరం,గొంతు నొప్పి, జలుబు లాంటి లక్షణాలు ఉన్నవారు తెలియజేయాలి.మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉన్న వారు హెల్ప్ డెస్క్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం. 7032984 734నంబరుకు ఫోన్ చేసి అనారోగ్య సమస్యలు ఉంటే తెలియజేయాలి. -సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్, మేడ్చల్
మున్సిపాలిటీ పరిధిలో నివసించే ప్రతి ఇంటినీ సర్వే చేస్తాం. ఇంటింటికీ సర్వేకు ఏఎన్ఎం, ఆశా, అంగన్ వాడీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందిని నియమించాం. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 20 వార్డుల్లో 7 బృందాలు సర్వే చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోవలసిన పని లేకుండానే సర్వే టీమ్కు సహకరిస్తే వారే వైద్యాధికారులకు సమాచారం అందిస్తారు. కరోనా ఉందని బయపడకుండా మందులు వాడాలి. – వాణి రెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగారం.