సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటించింది. ఆగస్ట్ 27న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు మేకర్స్ . ఇందులో భాగంగా ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశారు.
ఇటీవల ప్రభాస్తో చిత్ర యూనిట్కి బెస్ట్ విషెస్ చెప్పించి అందరి దృష్టి పడేలా చేసిన మేకర్స్ కొద్ది సేపటి క్రితం మహేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయించారు.ఈ ట్రైలర్ చాలా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సుధీర్ బాబు తన పాత్రకు వంద శాతం న్యాయం చేసినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాతో పక్కా హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది.జైలు కొచ్చిన మనిషి, జైలు నుండి బయటకు వెళ్లిన మనిషి ఎప్పటికీ ఒక్కటి కాలేరు. సోడాల శ్రీదేవి, లైటింగ్ సూరిబాబుల పాత్రలలో ఆనంది, సుధీర్ బాబు నటన బాగుంది.
ఈ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియా వ్యాప్తంగా చాలా మంచి బిజినెస్ జరగగా,థియెట్రికల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయినట్టు సమాచారం . సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ క్లైమాక్స్లో84 బోట్లతో రూపొందించిన ఫైటింగ్ సీన్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుందట.