మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాన్ని చక్కగా తీర్చిదిద్దాలని, అన్ని రకాల ఆటలకు సంబంధించిన కోర్టులతో సిద్ధం చేయాలని క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం అయన జిల్లా స్టేడియం గ్రౌండ్ లో రూ. 9 లక్షల వ్యయంతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్ పనులకు భూమి పూజ చేశారు. రూ. 5.7 లక్షల వ్యయంతో చేపట్టనున్న వాలీబాల్ కోర్టు ఆధునీకరణ పనులను ప్రారంభించారు.
ప్రధాన రహదారి నుంచి స్టేడియం మైదానానికి వచ్చే దారిలో మంచి ఆర్చి నిర్మించేందుకు డిజైన్ ఇందుకు తగ్గట్టుగా అంచనాలు రూపొందించాలని మంత్రి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్చిని సుందరంగా ఉండేలా డిజైన్ రూపొందించాలన్నారు. అంతకుముందు ఆయన స్టేడియం మొత్తం తిరిగి స్టేడియం అభివృద్ధికి మంజూరైన రూ. 2 కోట్ల 50 లక్షలకు సంబంధించిన పనులపై ఇంజినీరింగ్ అధికారులు, స్పోర్ట్స్ అధికారులతో సమీక్షించారు.
స్టేడియం మైదానంలో ఏఏ కోర్టులు వస్తున్నాయో మంత్రి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరేందర్ రెడ్డి, డీఈ విష్ణు, ఏఈ సురేష్, జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేశవాపురం లిఫ్ట్కు శంకుస్థాపన
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్