అజయ్కుమార్, శ్రీలక్ష్మీ జంటగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు బంగారం’. వెంకట నరసింహరాజ్ దర్శకుడు. లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సుమన్ క్లాప్నివ్వగా, హాస్యనటుడు పృథ్వీ కెమెరా స్విఛాన్ చేశారు. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో నేను, పృథ్వీ స్నేహితులుగా కనిపిస్తాం. మా స్నేహబంధం విడిపోవడానికి కారణమేమిటన్నది ఆసక్తిని పంచుతుంది. యూత్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం’ అని చెప్పారు. అజయ్కుమార్, శ్రీలక్ష్మీ, గౌతంరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: కాసర్ల శ్యామ్, సంగీతం: షారుక్ షేక్.