అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సస్పెన్షన్ హైకోర్టు స్టే.. నేటి నుంటి మూడు రోజుల లీగ్ మ్యాచ్లు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న హెచ్సీఏలో ఆధిపత్యం చేతులు మారుతూ వస్తున్నది. అంబుడ్స్మన్ జస్టిస్ దీపక్వర్మ..అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై విధించిన సస్పెన్షన్పై బుధవారం హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న జాన్ మనోజ్ వర్గానికి ఊరట లభించింది. హైకోర్టు స్టే నేపథ్యంలో బుధవారం ఏర్పాటు ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులు జాన్మనోజ్, విజయానంద్, నరేశ్శర్మ, సురేందర్ అగర్వాల్ పాల్గొన్నారు. గురువారం నుంచి మూడు రోజుల లీగ్ మ్యాచ్లు నిర్వహించబోతున్నామని, క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతుల మీదుగా సీజన్ ప్రారంభిస్తామని మనోజ్ పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్లోకి అజర్..కొత్తగా సభ్యులను ఎంపిక చేయడాన్ని మనోజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. హెచ్సీఏ నిబంధనలకు విరుద్ధంగా అజర్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. దీనిపై ఈనెల 18న జరిగే ఎస్జీఎమ్లో ప్రధానంగా చర్చిస్తామన్నారు.