ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్లో శ్రీముఖి ఒకరు. ఈ అమ్మడు తన మాటలతోనే కాదు అందచందాలతోను ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత శ్రీముఖి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా క్రేజీ అంకుల్స్ లో ప్రధాన పాత్ర పోషించగా, ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న ఈ అమ్మడు తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడిస్తుంది.
రీసెంట్గా తన పెళ్లి 31 ఏళ్ల వయస్సులో జరుగుతుందని చెప్పిన శ్రీముఖి ..కెరీర్ బిల్డ్ చేసుకోవడంతో తాను ఎంత కష్టపడ్డాననే విషయాలను చెప్పుకొచ్చింది. యాంకరింగ్ మొదలు పెట్టిన సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించేదని చెప్పిన శ్రీముఖి.. షూటింగ్ చేసే సమయంలో చాలాసేపు నిల్చుని ఉండాల్సి వచ్చేదని, కొన్ని షోలలో అయితే అంతసేపు నిలబడటం వల్ల కాళ్లు తిమ్మిర్లు వచ్చేసేవని చెప్పింది.
షూటింగ్ కోసం ఉదయం 7గం.లకు పోతే తర్వాతి రోజు ఉదయం 7గం.లకు ఇంటికి వెళ్లా. అసలు ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానా అని బాధపడి ఏడ్చిన సందర్భాలున్నాయని తెలిపింది. అయితే నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో వాటన్నింటినీ అధిగమించి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని శ్రీముఖి తెలిపింది. త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘జులాయి’ సినిమాతో నటిగా పరిచయమైన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి ఆ తర్వాత తన రేంజ్ మరింత పెంచుకుంది