స్పూర్తిదాయకమైన అంశంతో తెరకెక్కిన శ్రీకారం చిత్రం మార్చి 11న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. యువ హీరో శర్వానంద్, ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలలో కిషోర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్గా ఈ చిత్రాన్ని సన్ ఎన్ఎక్స్టీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ చేయగా, ఇది రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని తెలుస్తుంది
సన్ ఎన్ఎక్స్ టి అప్లికేషన్ లో తక్కువ సమయంలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా శర్వా ‘శ్రీకారం’ నిలిచింది. ‘శ్రీకారం’ సినిమా మిలియన్ల వ్యూస్ సంపాదించి గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచింది. వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజేస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారని అర్థం అవుతోంది. చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా.. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.