ప్రస్తుతం యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో నిధి అగర్వాల్ ఒకరు. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్శంకర్ చిత్రాలతో తెలుగుప్రేక్షకులకు చేరువైందీ కన్నడ భామ. ఇటీవలే తెలుగులో పవన్కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నాయికగా అవకాశాన్ని దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సుందరి తెలుగులో ఓ ఐటెంసాంగ్లో నర్తించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..రామ్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి నిర్దేశకత్వంలో ఓ భారీ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మాస్ అంశాలతో రూపొందించనున్న ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్ను చిత్రీకరించబోతున్నారట. ఈ పాటలో నిధి అగర్వాల్ నటించనుందని తెలిసింది. రామ్ సరసన ఆమె కథానాయికగా నటించిన ‘ఇస్మార్ట్శంకర్’ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో సెంటిమెంట్ను పునరావృతం చేసేలా నిధి అగర్వాల్ను సినిమాలో ఐటెంసాంగ్కు ఎంపికచేసుకున్నారని అంటున్నారు.