మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతుంది. ఒక్క మహారాష్ట్రలోనే సగానికి పైగా కేసులు పెరగుతుండడంతో పశ్చిమ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఎఫ్డబ్ల్యుఐసీఐ ) షూటింగ్ సమయంలో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని కచ్చితంగా అమలు చేసేందుకు పర్యవేక్షక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే కరోనా వలన బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, అలియా భట్, ఆమిర్ ఖాన్, విక్కీ కౌశల్ ఇలా పలువరు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.
శుక్రవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సమావేశమైన ఎఫ్డబ్ల్యుఐసీఐ ఈ నెలాఖరుదాకా అమలులో ఉండే మార్గదర్శకాలపై చర్చలు జరిపారు. జన సమూహంతో కూడిన సన్నివేశాలను చిత్రీకరించకూడదు అనే నిబంధనతో పాటుగా పెద్ద సంఖ్యలో డ్యాన్సర్స్తో షూటింగ్ జరపరాదు. అలానే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కరోనా జాగ్రత్తలు పాటించాలని , వీటన్నింటిపై పర్యవేక్షక బృందం ప్రత్యేక దృష్టి పెడుతుందని అన్నారు. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలానే సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్ చేయాలని స్పష్టం చేశారు.