పుణె: టీమ్ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. టాప్ ఆర్డర్లో కీలక బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా సిరీస్లోని మిగతా రెండు వన్డేలకు దూరమయ్యాడు. తొలి వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో శ్రేయస్ ఎనిమిదో ఓవర్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో మైదానం వీడాడు. వైద్య పరీక్షల కోసం వెంటనే ఆస్పత్రికి కూడా తరలించారు.
ఒకవేళ తన ఎడమ భుజానికి సర్జరీ చేయాల్సి వస్తే రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తానికి శ్రేయస్ దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని వైద్య పరీక్షలు, డాక్టర్ల సూచలను పరిగణనలోకి తీసుకొని శస్త్రచికిత్సపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అయ్యర్ భుజానికి బలంగా దెబ్బ తగిలిందని స్కానింగ్లో తేలింది. దీంతో ఐపీఎల్ 2021 మొదటి సగం మ్యాచ్లకు దూరంకానున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అయ్యర్ కెప్టెన్గా ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
కోహ్లీ ముందుకు..రాహుల్ వెనక్కి
ఆటగాళ్లకు గాయాలు..ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆందోళన!
కోహ్లీ వరల్డ్ రికార్డు..పాంటింగ్, సచిన్లను వెనక్కి నెట్టి!
ఇంగ్లాండ్కు షాక్..కెప్టెన్ మోర్గాన్ రెండో వన్డేకు దూరం!
పెళ్లి చేసుకుంటున్న స్టార్ స్పిన్నర్.. ఐపీఎల్ తొలి మ్యాచ్కు దూరం