ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
రూ.4.5కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నర్సంపేట, జూన్ 7 : నర్సంపేట అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన నర్సంపేటలో రూ.4.5కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. టఫెడ్కో నిధులు రూ.35 కోట్లతో నర్సంపేటలో ఇప్పటికే అభివృద్ధి పనులు మంజూరు చేయించినట్లు తెలిపారు. వాటితో డ్రైనేజీలు, రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, రోడ్ల వెడల్పు పనులు, ఆడిటోరియం, మార్కెట్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇంకా పట్టణం, నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనుల ప్రణాళికను తయారు చేసి నిధులు సమకూర్చుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నర్సంపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. నర్సంపేటలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు. 46 నాన్వెజ్, 72 వెజ్, 18 ఫ్రూట్, పది ఫ్లవర్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంగడి సెంటర్లోనూ కూరగాయలు విక్రయించే వ్యాపారులు కూడా మోడల్ మార్కెట్లోనే వ్యాపారం చేసుకోవాలని తెలిపారు. మంగళవారం నుంచి అక్కడే షాపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.