చేతికి ఎముక లేదన్నట్టు సాయం చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మందికి అండగా నిలిచాడు. అవసరమైన వారికి కాన్సన్ట్రేటర్స్ పంపి ఎందరో ప్రాణాలు నిలిపాడు. దేశంలో పలు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా స్థాపించాడు. ఆంధ్రాలో జూలై 23 ఉదయం 11:15 గంటలకు మా ఆక్సిజన్ ప్లాంట్ను నాగలక్ష్మీ చేతుల మీదుగా ప్రారంభించనున్నామని, సోనూసూద్ తాజాగా పేర్కొన్నారు.
అలానే నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఆండ్రావారిపల్లికి చెందిన బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ పౌండేషన్కి తన ఐదు నెలల పెన్షన్ పదిహేను వేల రూపాయలని విరాళంగా అందించింది. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసారు. ఒక అంధురాలు, యూట్యూబర్ నాగలక్ష్మి నా ఫౌండేషన్కు రూ.15వేలు విరాళం ఇచ్చారు. ఇది ఆమె ఐదు నెలల పింఛను. నా దృష్టిలో దేశంలో ఆమే అత్యంత సంపన్నురాలు. ఒకరి కష్టాలు చూసేందుకు కంటిచూపు ఉండాల్సిన అవసరంలేదు’ అని ఆ మధ్య తన ట్వీట్లో పేర్కొన్నారు సోనూసూద్.