ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించి అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్న రియల్ హీరో సోనూసూద్. ప్రాంతాలకు అతీతంగా సేవలు చేసుకుంటూ పోతున్న సోనూసూద్ సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. సోనూసూద్ బాటలో ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోలు కూడా పయనిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం తెలుసుకొని తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఇవి చాలా మందికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
చిరంజీవి, రామ్ చరణ్లు చేపట్టిన మహోత్తర కార్యక్రమంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించగా, తాజాగా సోనూసూద్ తన స్పందన తెలియజేశారు. చిరంజీవి, రామ్ చరణ్ల నిర్ణయం ఎంతో గొప్పది, ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించడం ఎంతో స్ఫూర్తిదాయకం, ఈ క్రమంలోనే మిగతా సెలెబ్రిటీలు ముందుకు రావాలి.ప్రభుత్వం చేస్తుందని చూడకుండా మనకు చేతనంత సాయం చేయాలి అని సోనూ పేర్కొన్నారు. ఇక ఆచార్య సినిమాపై స్పందించిన సోనూ చిత్రంలో విలన్గా నటించారు. అయితే ఇప్పుడున్న ఇమేజ్కు ఆయనను అభిమానులు విలన్గా చూడలేరని, సన్నివేశాలలో అతడిని కొట్టినా జనాలకు నచ్చదు కాబట్టి సోనూసూద్ను పాత్రను పోషించే నటుడిగానే చూడండి అనే డిస్ క్లెయిమర్ వేయాలని చిరంజీవి అన్నారని సోనూ పేర్కొన్నారు.