సోనూసూద్ ఇప్పుడు ఆయన పేద ప్రజల ఆపద్భాందవుడు. అడిగిన వారికి లేదనకుండా సాయాలు చేస్తున్న సోనూసూద్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తన గురించి కన్నా ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ పలు సేవలు చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్కి ప్రజలు గుడులు కట్టి పూజలు చేస్తున్నారు. ఆయన పేరుని తమ పిల్లలకి లేదంటే షాపులకి కూడా పెట్టుకుంటూ ప్రేమను చాటుకుంటున్నారు.
కరోనా కష్టకాలంలో స్థాయికి మించి సాయాలు చేసి సూపర్ హీరోగా మారాడు సోనూసూద్. అయితే ఈయన బయటి జనాన్ని సంతోషపరచడమే కాకుండా కుమారుడు కోరిన కోరికను కూడా తీర్చాడని వార్తలువచ్చాయి. జూన్ 20న ఫాదర్స్ డే కాగా, ఈ సందర్భంగా తన కొడుకు ఇషాంత్ సూద్ కు రెండున్నర కోట్ల రూపాయలతో మెర్సిడెజ్ బెంజ్- మేబాచ్ జీఎల్ఎస్ 600 మోడల్ కారును కొని గిఫ్టుగా ఇచ్చాడని వార్తలు వచ్చాయి.
తనపై వచ్చిన ప్రచారాలకు సంబంధించి సోనూసూద్ క్లారిటీ ఇచ్చాడు. కేవలం ట్రయల్ కోసమే కొత్తకారును ఇంటికి తీసుకొచ్చామే తప్ప దాన్ని కొనుగోలు చేయలేదని వివరణ ఇచ్చాడు. అయినా ఫాదర్స్డే రోజు పిల్లలు తనకేదైనా ఇవ్వాలి కానీ తానెందుకు వాడికి కారు బహుమతిగా ఇస్తాననని ప్రశ్నించాడు. ఫాదర్స్డే రోజు కొడుకులిద్దరితో కాలక్షేపం చేయడమే అమూల్యమైన కానుకగా సోనూసూద్ చెప్పుకొచ్చాడు.