సీనియర్ హాస్యనటి శ్రీలక్ష్మి, పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి w/o సత్యమూర్తి’. గోగుల నరేంద్ర నిర్మాత. చైతన్య కొండ దర్శకుడు. ఈ సినిమాలోని ‘అచ్చమైన తెలుగింటి పిల్లవే’ అనే గీతాన్ని ఇటీవల దర్శకుడు మారుతి విడుదలచేశారు. సత్యకశ్యప్ సంగీతాన్ని అందించారు. ప్రణవం సాహిత్యాన్ని సమకూర్చిన ఈ గీతాన్ని సాయిచరణ్ ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇరవైఏళ్ల యువకుడు, అరవైఏళ్ల మహిళ ఎలా భార్యాభర్తలయ్యారనే పాయింట్తో రూపొందుతున్న చిత్రమిది. కుటుంబకథా చిత్రంగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరున సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు.