వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఓ ఓబులమ్మ..బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ’ అనే పల్లవితో సాగే గీతాన్ని శుక్రవారం చిత్రబృందం విడుదలచేసింది. కీరవాణి సంగీతం, సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సత్యయామిని, రోహిత్ ఆలపించారు. రాయలసీమ యాసలో ప్రేయసిప్రియుల మధ్య ఎడబాటును అందంగా వర్ణిస్తూ కీరవాణి చక్కటి సాహిత్యాన్ని అందించారు. భాను కొరియోగ్రఫీ సమకూర్చారు. ‘సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. అడ్వెంచరస్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నాం. అడవిలో ఓ గొర్రెల కాపరికి ఎదురైన అనుభవాలు ఉత్కంఠను పంచుతాయి. అక్టోబర్ 8న ఈ సినిమాను విడుదలచేస్తాం’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ: వి.ఎస్. జ్ఞానశేఖర్.