న్యూఢిల్లీ, జూన్5: మరింత సరళంగా వుండేలా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ను (www.incometax. gov.in) జూన్ 7న ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్లు త్వరితంగా జారీఅయ్యేందుకు ఐటీ రిటర్న్లను తక్షణమే ప్రాసెస్చేసేవిధంగా కొత్త పోర్టల్ అనుసంధానమై వుంటుందని, తదుపరి మొబైల్యాప్ను కూడా విడుదల చేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కొత్త టాక్స్ పేమెంట్ సిస్టమ్ జూన్ 18న మొదలవుతుందని సీబీడీటీ వెల్లడించింది. కొత్త పోర్టల్ ఫీచర్లను వివరిస్తూ ఇంటరాక్షన్లు, అప్లోడ్లు, పెండింగ్ యాక్షన్లు ఒకే డ్యాష్బోర్డుపై కన్పిస్తాయని, 1,2,3 ఐటీఆర్లు (ఆదాయపు పన్ను రిటర్న్లు) ప్రిపేర్చేసే సాఫ్ట్వేర్ ఉచితంగా లభిస్తుందని, త్వరలో 3,5,6,7 ఐటీఆర్లు ప్రిపేర్చేసే సాఫ్ట్వేర్ను అందిస్తామని తెలిపింది.