కులకచర్ల, ఏప్రిల్ 1: మండల పరిధిలోని ముజాహిద్పూర్, చౌడాపూర్ గ్రామాల్లో తైబజార్లకు గురువారం గ్రామ సర్పంచులు లక్ష్మి, కొత్త రంగారెడ్డి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ముజాహిద్పూర్ గ్రామంలో నిర్వహించిన వేలం పాటలో గ్రామానికి చెందిన ముసలి అనంతయ్య రూ. 70400లకు వేలం పాటలో తైబజార్ను దక్కించుకున్నాడు. చౌడాపూర్లో నిర్వహించిన వేలం పాటలో గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య రూ. 158000లకు వేలం పాటలో తైబజార్ను దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చంద్రభూపాల్రావు, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్రెడ్డి, చౌడాపూర్ గ్రామంలో ఎంపీటీసీ శంకర్, ఉపసర్పంచ్ శివకుమార్, వార్డు సభ్యుడు అశోక్, పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, గ్రామస్తులు కృష్ణయ్య, పాల యాదయ్య, వెంకటేశ్, యాదయ్య, శ్రీను, చాకలి యాదయ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
దాదాపూర్, దిర్సంపల్లి గ్రామాల్లో..
దోమ, ఏప్రిల్ 1 : మండల పరిధిలోని దాదాపూర్ గ్రామ పంచాయతీలో తైబజార్(అంగడి) 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బహిరంగ వేలం నిర్వహించారు. లక్ష ఐదు వందల రూపాయల అత్యధిక వేలం పాట పాడిన గ్రామానికి చందిన ఆర్ రాములు తైబజార్ను చేజిక్కించుకున్నారు. దిర్సంపల్లి గ్రామ తైబజార్ను అదే గ్రామానికి చెంది ఈ రవికుమార్గౌడ్ బహిరంగ వేలంపాటలో రూ. 65 వేల రూపాయల వద్ద తైబజార్ను దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాలకు చెందిన సర్పంచ్లు కృష్ణ, శాంతారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రవీందర్రెడ్డి, మొగులయ్య, ఆయా గ్రామాల వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.