యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్లో ఇప్పటి వరకు 27 చిత్రాలు నటించారు. ఇందులో హిట్స్, ఫ్లాప్స్కూడా ఉన్నాయి. జయాపజాయలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న సందీప్ కిషన్ ఈ ఏడాది ఏ1 ఎక్స్ప్రెస్తో సందడి చేశాడు. ప్రస్తుతం గల్లీ రౌడి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ రోజు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఆయన 28వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చింది.
“ఎక్కడికి పోతావు చిన్నవాడ”, “క్షణ క్షణం” సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు వీఐ ఆనంద్.. యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కించబోతున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. 2015లో వీరిద్దరి కాంబినేషన్లో టైగర్ అనే చిత్రం రూపొందింది. ఇప్పుడు సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి రాజేష్ దందా నిర్మాణం వహిస్తుండగా పరిస్థితులు సెట్ అయ్యాక రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.