ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కీర్తి సురేష్ తెరకెక్కిస్తుండగా, కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత మహేష్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
మహేష్ ఇటీవల ఆరుగురు స్టార్ డైరెక్టర్ లతో సీక్రెట్ మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారని.. పార్క్ హయత్ లో వారితో ప్రత్యేకంగా భేటీ అయి కొత్త కథలను వింటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తోనూ మహేష్ ప్రత్యేకంగా సిట్టింగ్ వేశారట. ఈ సినిమా కథపై వివరణాత్మక చర్చలు జరుగుతున్నట్లు వినికిడి.
`ఉప్పెన` డైరెక్టర్ బుచ్చి బాబు సనా.. గోపీచంద్ మలినేనినిలని ఒకే చోట కలుసుకోవడం జరిగిందట. వీరితో పాటు `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ సందీప్ వంగా కూడా మహేష్ బాబును కలిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని అప్పట్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
మరో ఇద్దరు దర్శకులు కూడా మహేష్ ని కలిసి కథకు సంబంధించి చర్చలు జరిపారట. ప్రస్తుతం విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే రానున్న రోజులలో మహేష్ వరుస సినిమాలతో సందడి చేయనున్నట్టు సమాచారం.
మహేష్ నటిస్తున్న `సర్కారు వారి పాట` దాదాపుగా పూర్తయింది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్.. 14 రీల్స్ ప్లస్.. జిఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని.. వెన్నెల కిషోర్.. సుబ్బరాజ్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.