‘మా’ ఎన్నికల (MAA elections) కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రకాశ్రాజ్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య నువ్వా,నేనా అన్నట్టుగా హోరాహోరీ పోటీ సాగుతుంది. తొలుత ఈసీ సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టగా… ఇప్పటికే ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ నుంచి నలుగురు గెలుపొందారు. అయితే తాజాగా విష్ణు ప్యానెల్ నుంచి తొలి విజయం నమోదైంది. విష్ణు ప్యానెల్ (Manchu Vishnu) నుంచి ట్రెజరర్ గా పోటీ చేస్తున్న శివబాలాజీ ప్రత్యర్థి నాగినీడుపై గెలుపొందారు.
విష్ణు ప్యానెల్ నుంచి మరోవైపు జనరల్ సెక్రటరీగా రఘుబాబు ప్రత్యర్థి జీవితపై గెలిచారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రకాశ్రాజ్ ప్యానెల్లో ఆరుగురు లీడ్లో ఉండగా..విష్ణు ప్యానెల్ లో 8 మంది లీడ్ లో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ నుంచి ఇప్పటికే నలుగురు ఈసీ సభ్యులు శివారెడ్డి (Siva Reddy), కౌశిక్, యాంకర్ అనసూయ, సురేశ్ కొండేటి గెలుపొందారు.
విష్ణు ప్యానెల్లో మాదాల రవి ఆధిక్యంలో కొనసాగుతుండగా..ప్రకాశ్రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. మరోవైపు ప్రకాశ్రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా శ్రీకాంత్ లీడ్లో కొనసాగుతుండగా..బాబుమోహన్ వెనుకంజలో ఉన్నారు. జనరల్ సెక్రటరీగా గెలుపొందిన రఘుబాబుకు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Vijay Devarakonda: తిరుమలలో ఫ్యామిలీతో ప్రత్యక్షం అయిన విజయ్ దేవరకొండ