శ్రీకర్ కృష్ణ, శ్రావణి నిక్కి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘సిరిమల్లె పువ్వా’. ఈ చిత్రాన్ని షకీరా మూవీస్ పతాకంపై కౌశర్ జహాన్ నిర్మిస్తున్నారు. గౌతమ్ మైలవరం దర్శకుడు. ఈ సినిమా రాజకీయ నేపథ్య ప్రేమకథగా రూపొందింది. ఈ నెల 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు చంద్ర మహేష్, సముద్ర తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కౌశర్ జహాన్ మాట్లాడుతూ…‘కుల పట్టింపులతో ఇబ్బందులు పడే ప్రేమికులను నిత్యం చూస్తున్నాం. అణగారిన వర్గానికి చెందిన ఓ అమ్మాయి, అగ్రవర్ణానికి చెందిన ఓ అబ్బాయి మధ్య సాగే ప్రేమ కథ ఇది. నిజమైన ప్రేమకు కులం అడ్డుకాదనే సందేశంతో చిత్రాన్ని నిర్మించాం. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం అందిస్తూనే ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సత్యానంద్, సంగీతం : జీబు