సెప్టెంబర్ 5న మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రోజరోజుకి రసవత్తరంగా మారుతుంది. ఒకరిని మించి మరొకరు అన్నట్టు గొడవలకు దిగుతున్నారు. అయితే బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్లు ఇంటి సభ్యులకు తలనొప్పిగా మారాయి. బిగ్ బాస్ వద్దు ఏమోద్దు పోయి మా పని మేం చేసుకుంటాం అన్న చందాన కొందరు మాట్లాడుతున్నారు.
కాజల్కి ఇచ్చిన టాస్క్ సక్రమంగా నిర్వర్తించలేదు. ఇక టాస్క్లో భాగంగా షణ్ముఖ్కి సేవకుడిగా ఉన్న లోబో ఆయనకు సపర్యలు చేసి అలసిపోయాడు.స్మోకింగ్ రూమ్లో తన ఫ్రస్టేషన్ను విశ్వ ముందు బయటపెట్టాడు. ‘ఈ గేములు నాకు నచ్చట్లేదు, ఇది నా టేస్ట్ కాదు, నాకు సెట్టయితలేదు. పోయి నా దుకాణంలో ఉంటా, కానీ ఇదంతా ఏంది?’ అని అసహనానికి లోనయ్యాడు. దీంతో విశ్వ..లోబోని సముదాయించాడు.
కిచెన్లో పనులు డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో ఉమోదేవిని వంటకు అప్పగిస్తే ఆమె… నాన్వెజ్ వండలేను, ఎవరైనా నాన్వెజ్ వండితే ఆ గిన్నెలను శుభ్రం చేయను అని తేల్చి చెప్పింది. మార్నింగ్ వెజ్ వండేందుకు ప్రియాంక సింగ్ ఉందని లహరి చెప్పగా దాన్ని ఉమాదేవి తప్పుగా అర్థం చేసుకుంది. దీంతో ఉమాదేవి నానా హంగామా చేస్తూ అందరికి చిరాకు తెప్పించింది. దీంతో లహరి కూడా ఆమెపై ఫైర్ అయింది.
‘శక్తి చూపరా డింభకా!’ టాస్క్ పూర్తైన తర్వాత బిగ్బాస్ కెప్టెన్సీ పోటీ దారులు హమీదా, మానస్, విశ్వ, సిరిలకు ‘తొక్కరా తొక్కు హైలెస్సా’ అనే టాస్కు ఇచ్చారు. ఈ టాస్క్లో భాగంగా సైకిల్ నిరంతరాయంగా తొక్కుతూ దాని మీదున్న బల్బ్ వెలుగుతూ ఉండేలా జాగ్రత్తపడాలని ఆదేశించాడు. దీనికి ప్రియనే సంచాలకురాలిగా ఎన్నుకున్నారు.
టాస్క్ జరుగుతున్న సమయంలో పలు డిస్కషన్స్ జరిగినవి. ఎవరు ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో కొంత చర్చలు నడవగా, చివరికి ఈ టాస్క్లో సిరి గెలిచి కెప్టెన్ బ్యాండ్ అందుకుంది. విశ్వను రేషన్ మేనేజర్గా ఎంపిక చేసింది.