మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఫ్రీడం రన్
ర్యాలీలను ప్రారంభించిన కలెక్టర్లు, సీపీ
స్వాతంత్య్ర చరిత్ర యువత తెలుసుకోవాలి : సంగారెడ్డి కలెక్టర్
సమరయోధుల ఆశయ సాధనకు కృషి చేయాలి : సిద్దిపేట సీపీ
దేశ ఔన్నత్యాన్ని కాపాడాలి : మెదక్ కలెక్టర్ దేశ చరిత్రను యువత తెలుసుకోవాలి
సంగారెడ్డి, మార్చి 24 : దేశ చరిత్రను నేటి యువత తెలుసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం ‘ఆజాది కా అమృత్’ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ములను స్మరించుకున్నారు. ప్రభుత్వ అతిథిగృహం నుంచి అంబేద్కర్ మైదానం వరకు ఫ్రీడం రన్ను కలెక్టర్, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ప్రారంభించారు. దేశం కోసం ఎంతో మంది త్యాగాలు చేసి అమరులయ్యారని తెలిపారు. గాంధీ, సుభాశ్ చంద్రబోస్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించి నేటి స్వాతంత్య్రాన్ని ప్రజలు, క్రీడాకారులకు ముందుంచిన ఘనత వారికే దక్కిందన్నారు. అనంతరం ఎస్పీ చద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ 75 ఏండ్ల స్వాతంత్య్ర పండుగ జిల్లాలో నిర్వహించుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం వచ్చిందని, ఆ నాటి త్యాగధనుల చరిత్రను నేటి క్రీడాకారులు, విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి జావిద్ అలీ, కోచ్లు దేవిక, జిమ్నాస్టిక్ కోచ్, స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్, డీఎస్పీ బాలాజీ, సీఐ రమేశ్, జిమ్నాస్టిక్ కార్యదర్శి వెంకటేశం, పట్టణ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, హ్యాండ్బాల్ కార్యదర్శి విజయ్, హాకీ సీనియర్ క్రీడాకారుడు నజీర్, ఫుట్బాల్ సీనియర్ క్రీడాకారుడు అలీ పాల్గొన్నారు.
సమష్టిగా, ఐక్యతా భావంతో దేశ ఔన్నత్యాన్ని కాపాడాలి
మెదక్, మార్చి 24: స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ నాటి చారిత్రక సంఘటనలు, ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ సాగాల్సిన అవసరం ఉందని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ధ్యాన్చంద్ క్రాస్ రోడ్ నుంచి ప్రధాన పోస్టాఫీస్ వరకు ఏర్పాటు చేసిన 2కే, ఫ్రీడం రన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. సమష్టిగా, ఐక్యతా భావంతో దేశ ఔనత్యాన్ని కాపాడాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. జిల్లా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. సర్వీసుల శాఖ ద్వారా ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. ప్రతిఒక్కరూ రోజు వ్యాయామం చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, ఆర్డీవో సాయి రాం, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరుశురాం నాయక్, డీఈవో రమేశ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, బీసీ సంక్షేమ శాఖాధికారి జగదీశ్, గనుల శాఖ సహాయ సంచాలకుడు జయరాజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మత్య్సశాఖ, ఉద్యాన శాఖ సంచాలకులు, జిల్లా యువజన సంక్షేమాధికారి నాగరాజు, డీఎస్పీ కృష్ణమూర్తి తదితర జిల్లా అధికారులు, సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు, టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, కబడ్డీ, కరాటే తదితర క్రీడాకారులు, యువజన సంఘాలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని భారత్మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ పోస్టాఫీస్ వరకు పరుగు సాగింది. అనంతరం పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైతు బజార్ను కలెక్టర్ పరిశీలించి త్వరితగిన పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు. పట్టణంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడాలని తెలిపారు.