బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన సోనాక్షిసిన్హా ఓటీటీ వేదికల మీద వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. తాజాగా ‘బుల్బుల్ తరంగ్’ పేరుతో సోనాక్షిసిన్హా ఓ కొత్త వెబ్ సినిమా చేయబోతున్నది. ‘టాయిలెట్-ఏక్ప్రేమ్ కథా’ ఫేమ్ శ్రీనారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వరకట్నం, మహిళా సమస్యలపై పోరాడే శక్తివంతమైన యువతిగా సోనాక్షి సిన్హా కనిపించనుందని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం మధ్యస్థాయి నగరాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు దృశ్యరూపంలా సినిమా ఉంటుందని చెబుతున్నారు. కథ తన హృదయాన్ని హత్తుకుందని, కెరీర్లో తొలిసారి పూర్తిస్థాయి మహిళా ప్రధాన చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని సోనాక్షిసిన్హా చెప్పింది.