పాత్రకు తగ్గట్టుగా తమ శరీరాన్ని మలచుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి బాగా బరువు పెరగాల్సి ఉంటుంది, లేదంటే బాగా సన్నబడాల్సి వస్తుంది. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క భారీగా బరువు పెరిగింది. కృతి సనన్ కూడా తాను ప్రగ్నెంట్గా కనిపించేందుకు కొంచెం లావెక్కింది. అయితే తమిళ నటుడు శింబు ప్రస్తుతం చేస్తున్న‘వెందు తనిందదు కాడు’ సినిమా కోసం ఏకంగా 30 కేజీల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచాడు.
శింబు- గౌతమ్ మీనన్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులలో ఏరేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది వరకే ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ తమిళ రీమేక్ వెర్షన్లు రాగా, ఇప్పుడు ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో శింబు లుంగీ ధరించి, కర్రపట్టుకుని అమాయకంగా కనిపించాడు శింబు. అతని వెనక ప్రాంతంలో మంటలు చెలరేగుతుంటాయి.
‘వెందు తనిందదు కాడు’ అంటే కాలి బూడిదైన అడవి అని అర్థం. టైటిల్ని బట్టి ఈ చిత్రం అడవి నేపథ్యంలో రూపొందుతుందని అర్దమవుతుంది. అయితే శింబు తాజాగా తన సోషల్ మీడియాలో స్లిమ్ లుక్లోకి మారన ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో క్లీన్ షేవ్తో డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. ఇది చూసిన వారందరు శింబు ట్రాన్స్ఫర్మేషన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వెందు తనిందదు కాడు’ కోసం శింబు ఇలా మారగా, ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వెల్స్ ఇంటర్నేషనల్ పతాకంపై డాక్టర్ ఇషారీ కె. గణేశ్ నిర్మిస్తున్నారు.