ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక గత ఏడాది కరోనా వలన వాయిదా పడింది. సైమా అంటే ఆ సందడే వేరు. సౌత్ సినీ పరిశ్రమకు చెందిన తారలందరు ఒకే చోట చేరి చేసే సందడి వెరే లెవల్లో ఉంటుంది. అందాల ముద్దుగుమ్ము స్టైలిష్ డ్రెస్లలో హోయలు పోతూ అభిమానులని అలరిస్తూ ఉంటారు.
ఈ ఏడాది కూడా సైమా ఉండదేమో అని సినీ ప్రియులు భావిస్తున్న తరుణంలో సైమా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పింది. 2021 అవార్డుల కార్యక్రమం ఎప్పుడుంటుందో తెలియజేస్తూ.. ‘మీ నిరీక్షణకు తెరపడింది! సైమా అవార్డ్స్ వేడుకలు తిరిగి వచ్చాయి. సెప్టెంబరు 11, 12న సినిమా పండగ జరుపుకొందాం’ అని పేర్కొంది. హైదరాబాద్ వేదికగా ఈ అవార్డ్ వేడుక కార్యక్రమం జరగనుండడం గమనర్హం.
2012లో ఈ అవార్డుల కార్యక్రమం మొదలు కాగా, ఈ అవార్డ్ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, టెక్నీషియన్స్ పలు విభాగాలలో పలు అవార్డ్స్ అందుకుంటూ ఉంటారు. స్టార్స్ని ఎంకరేజ్ చేసే క్రమంలో ఏర్పాటైన సైమా అవార్డ్ వేడుక దాదాపు విదేశాలలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తొలిసారి హైదరాబాద్లో నిర్వహిస్తుండటం విశేషం. మరి ఈ అవార్డ్ వేడుకకి హోస్ట్గా ఎవరు ఉంటారు. కరోనా నేపథ్యంలో ఎంత మంది స్టార్స్ హాజరవుతారు, ఎవరెవరు అవార్డ్స్ అందుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.