బాలీవుడ్లో ప్రేమ కహానీలు కొత్తేమి కాదు, ఎంతో మంది స్టార్స్ ప్రేమలో పడి కొన్నేళ్లు డేటింగ్ చేసుకున్నాక పెళ్లి చేసుకున్నారు. మరి కొద్ది రోజులలో రణ్బీర్ కపూర్, అలియా భట్ కూడా పెళ్లి పీటలెక్కనున్నారు. ఇక వీరి దారిలోనే సిద్దార్ధ్ మల్హోత్ర, కియారా అద్వానీ ప్రయాణిస్తున్నట్టు అనుమానం కలుగుతుంది. ఈ మధ్య ఎక్కడ చూసిన వీరిరివురు జంటగా కనిపిస్తున్నారు.
గతంలో వీళ్లిద్దరు 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆఫ్రికాకు వెళ్లారు. అపుడు వీళ్లిద్దరు ఎవరి కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. 2021 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మాల్దీవులకి వెళ్లారు. అక్కడ కియారా చేసిన రచ్చకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి.ఈ ఇద్దరి మధ్య ఉంది ప్రేమనా, లేక ఫ్రెండ్షిపా అనేది తెలియక నెటిజన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
కియారా శనివారం రోజు 29వ వసంతంలోకి అడుగుపెట్టగా, ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ధార్థ్.. షేర్షా బిహైండ్ ది సీన్ స్టిల్ షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే కీ.. నీతో షేర్షా ప్రయాణం అద్భుతంగా నడిచింది. ఎన్నో జ్ఞాపకాలు. బిగ్ లవ్.. సంతోషంగా ఉండు అంటూ కామెంట్ చేశారు. సిద్ధార్థ్ కామెంట్స్ పై ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది. కార్గిల్ యుద్ధ వీరుడు విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా ‘షేర్షా’ సినిమా తెరకెక్కగా, ఈ సినిమాలో సిద్ధార్ధ్ మల్హోత్రని విక్రమ్ బాత్రా తన కోడ్ నేమ్ ‘షేర్షా’ పేరుతో పిలుస్తుంటారు. కార్గిల్ యుద్ధంలో తోటి సైనికుల్లో స్పూర్తి రగిలించే విక్రమ్ బాత్రాగా సిద్ధార్థ్ నటన బాగుంది. కాబోయే భార్య డింపుల్ చీమా పాత్రలో కియారా అద్వానీ నటించింది.
29th birthday on Saturday, a day which was made special by her rumoured boyfriend Sidharth Malhotra. In an Instagram story, Sidharth shared a behind-the-scenes still from the sets of Shershaah and wrote: “Happy birthday, Ki! Shershaah’s journey with you has been incredible. Lots of memories from this one.” In his birthday post for Kiara, Sidharth added: “Stay amazing, big love.”