‘నటుడిగా నాకు కొత్త ఇమేజ్ను తీసుకొచ్చే చిత్రమిది. జీవితాంతం గుర్తుండిపోయే మంచి పాత్రను ఈ సినిమాలో చేశాను’ అని అన్నారు సిద్ధార్థ్. శర్వానంద్తో కలిసి ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అదితీరావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘అన్ని భాషల వారు గర్వంగా చెప్పుకునే తెలుగు సినిమా ఇది. గొప్ప సినిమాల జాబితాలో నిలిచిపోతుంది. శుక్రవారం పరీక్షలో మేము పాస్ అవుతామనే నమ్మకముంది’ అని తెలిపారు. తన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రమిదని అదితీరావ్ హైదరీ చెప్పింది. ‘ఈ సినిమాకు హీరోలుగా శర్వానంద్, సిద్ధార్థ్ అద్భుతంగా కుదిరారు. భవిష్యత్తు తరాలకు ఈ కథ, క్యారెక్టరైజేషన్స్ కొలమానంగా ఉంటాయి’ అని దర్శకుడు పేర్కొన్నారు. దసరా సెంటిమెంట్ తమ బ్యానర్కు కలిసి వస్తుందని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు.