ఒకప్పుడు కేవలం సినిమాలతో బిజీగా ఉండే సిద్ధార్థ్.. ఈ మధ్య రాజకీయాల్లో బాగా తల దూరుస్తున్నాడు. మరీ ముఖ్యంగా BJPతో ఈ నటుడికి అస్సలు పడటం లేదు. బిజెపిని ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నాడు సిద్ధార్థ్. దాంతో వాళ్లు కూడా ఈయనపై రివర్స్ అటాక్ చేస్తున్నారు. అయినా కూడా సిద్దు ఎక్కడ తగ్గడం లేదు. బయట జరుగుతున్న పరిస్థితులను అనుసంధానిస్తూ బీజేపీని ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు ఈయన. దాంతో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అంటే కమలం పార్టీ నాయకులకు కాలిపోతుంది. ఆయన పేరు వింటే మండిపడుతున్నారు.
తాజాగా బీజేపీ స్టేట్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశాడు సిద్ధార్థ్. అయితే ఇది మొదలు పెట్టింది విష్ణు. సిద్దు నటించిన సినిమాలకు దావూద్ ఇబ్రహీం ఫండింగ్ చేస్తాడంట.. ఇది నిజమేనా సమాధానం ఇవ్వండి సిద్ధార్థ అంటూ ట్వీట్ చేశాడు విష్ణువర్ధన్ రెడ్డి. దీనిపై వెంటనే స్పందించాడు సిద్ధూ. ఈయన కామెంట్ చేసిన తీరు.. ఇచ్చిన కౌంటర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ‘రా’ అంటూ సంబోధించాడు సిద్దు. నో రా.. తను నాకు టిడిఎస్ కట్టడానికి ఇష్టపడడం లేదు.. నేను ఇక్కడ పర్ఫెక్ట్ సిటిజన్, టాక్స్ పేయర్ కదరా విష్ణు.. వెళ్లి పడుకో.. బిజెపి స్టేట్ సెక్రటరీ అంట సిగ్గుండాలి అంటూ సమాధానం ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు అధికార పార్టీని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ హెడ్ లైన్స్ లో ఉంటున్నాడు సిద్ధార్థ. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు సిద్దు. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమాలో శర్వానంద్ తో కలిసి నటిస్తున్నాడు సిద్ధూ. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇందులో పర్ఫెక్ట్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ హీరో. ఏది ఏమైనా ఇటు సినిమాలు అటు రాజకీయాలు రెండింటిని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నాడు బొమ్మరిల్లు హీరో.