నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. గురువారం హైదరాబాద్లో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. కోల్కతా నేపథ్యంలో పీరియాడికల్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘కళా దర్శకుడు అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవలే హైదరాబాద్లో పది ఎకరాల స్థలంలో భారీ కోల్కతా సెట్ను నిర్మించగా..అది వర్షాల వల్ల దెబ్బతింది. ఈ సెట్ను పునర్నిర్మించి ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నాం. వైవిధ్యమైన ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. ఇప్పటికే విడుదలైన నాని, సాయిపల్లవి ఫస్ట్లుక్ పోస్టర్స్కు మంచి స్పందన లభిస్తోంది’ అని చిత్రబృందం తెలిపింది. రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినవ్ గోమటం, జీషూసేన్గుప్తా, లీలా శ్యామ్సన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సానుజాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, ఒరిజినల్ స్టోరీ: సత్యదేవ్ జంగా, నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్స్, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.