షాద్నగర్, ఏప్రిల్ 11: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుఫూలే అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా రు. ఫూలే జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫూలే ఆశ యాలను సాధించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నా రు. ఆయన సేవలు చిరస్మరణీమన్నారు. తన జీవిత భాగ స్వామి సావిత్రిబాయిఫూలేను దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాం బాల్ నాయక్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, జడ్పీ టీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, ఎం పీటీసీ శివరాజ్, కౌన్సిలర్లు సర్వర్పాషా, శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, బీసీ సం ఘం నేత అశోక్గౌడ్, నేతలు జూపల్లి శంకర్, లక్ష్మణ్ నాయక్, శేఖర్, శ్రీధర్రెడ్డి, నర్సింహ, నందకిషోర్ పాల్గొన్నారు.
అసమానతల తొలగింపునకు కృషి
చేవెళ్ల ఏప్రిల్ 11: సమాజ మార్పు కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుల సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. చేవెళ్లలోని ఫూలే విగ్ర హ నికి ఎమ్మెల్యే యాదయ్య నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఉన్న అస మానతలు తొలగించడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి , వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, చేవెళ్ల సోసైటీ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివనీల, దళిత అవార్డు గ్రహీత బురాన్ ప్రభాకర్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి పడాల ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
ఫూలే విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
షాద్నగర్ రూరల్, ఏప్రిల్ 11: ఫరూఖ్నగర్ మండలం లోని వెలిజర్ల గ్రామంలో ఫూలే విగ్రహా ఏర్పాటుకు ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్ ఆదివారం భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, బాల్యవిహాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారాన్నరు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచు కోవాల న్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, గ్రామ సర్పం చ్ అమృతమ్మ, ఎంపీటీసీ లావణ్య, టీఆర్ఎస్ నాయ కులు రవీందర్, జాంగరి నర్సింహ, రవి, అశోక్రెడ్డి, శేఖర్యాదవ్,శివ, శ్రీనివాస్, నరేశ్, శివకుమార్, యాద య్య, నర్సింహు లు,రెడ్యానాయక్ పాల్గొన్నారు
ఫూలే బాటలో నడువాలి
కొత్తూరు, ఏప్రిల్ 11: జ్యోతిరావు ఫూలే దేశానికి సేవలు మరువలేనివని కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నా రు. ఫూలే జయంతి సందర్భంగా మండలం కేం ద్రం కొత్తూ రులో జ్యోతిరావు ఫూలే విగ్రహానికి మూల మా లలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడు తూ ఫూలే బాటలో యువత ముందుకు నడువాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, టీఆర్ ఎస్ సీని యర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, సుఖేం దర్రెడ్డి, మాజీ ఎంపీటీపీ దేవేందర్యాదవ్, నాయ కులు జనార్దన చారీ, రవినాయక్, గోపాల్నాయక్, రైతు సమన్వ య సమితి మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్ పాల్గొన్నారు.
కొందుర్గు జిల్లెడు చౌదరిగూడలో..
కొందుర్గు, ఏప్రిల్ 11: కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మం డల కేంద్రాల్లో ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్రెడ్డి, హఫీజ్, సర్పంచ్ గూడ వెంకటస్వామి, పీఏసీఎస్ డైరెక్టర్ జబ్బార్, ఎంపీటీసీ రాములు, నాయకులు బాల్రాజు, మల్లేశ్, శేఖర్, భాస్కర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
త్యాగశీలి జ్యోతిరావుఫూలే
షాబాద్, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావుఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అన్నారు. షాబాద్ మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భం గా కృష్ణయాదవ్ మాట్లాడుతూ సమాజ చైతన్యం కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలి జ్యోతిరావుపూలే అని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మద్దూరు మల్లే శ్, తమ్మలి రవీందర్, రాపోలు నర్సింహులు, కుమ్మరి దర్శ న్, సంజీవ, చందు, శ్రీశైలం, రామకృష్ణ, పాండు ఉన్నారు.
మొయినాబాద్లో..
మొయినాబాద్, ఏప్రిల్11: మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులు సి కిరణ్, చిన్న మంగ ళారం గ్రామంలో స్వేరో సర్కిల్ జిల్లా ప్రధాన కార్య దర్శి జి నర్సింగ్రావు ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
శంకర్పల్లిలో …
శంకర్పల్లి, ఏప్రిల్ 11: శంకర్పల్లిలో మహాత్మా జ్యోతి రావు ఫూలే 194వ జయంతిని వివిధ పార్టీల నాయకులు, అభి మానులు ఘనంగా జరిపారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఇవీ కూడా చదవండి…
న్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యం: పొంగులేటి