‘రెండేళ్లుగా ఎన్నో కష్టాలకోర్చి ఈ చిత్రాన్ని రూపొందించాం. ట్రైలర్స్, విజువల్స్ నచ్చితే థియేటర్లకు వచ్చి మా సినిమాను చూడమని ప్రేక్షకుల్ని కోరుతున్నా’ అని అన్నారు అరవింద్ కృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శుక్ర’. సుకుపూర్వజ్ దర్శకుడు. అయ్యన్ననాయుడు నల్ల, తేజ పల్లె నిర్మిస్తున్నారు. శ్రీజితఘోష్ కథానాయిక. ఈ నెల 23న ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘శుక్ర అనే ఆపరేషన్ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. గతంలో తెలుగు తెరపై వచ్చిన ఏ సినిమాతో పోలికలు ఉండవు. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా మాకు అందుబాటులో ఉన్న థియేటర్లలో సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు.