భూపాల్పల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే -6 గనిలో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గనిపైకప్పు కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.
ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.
కార్మికులు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి