కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో వస్తున్న చిత్రం సలార్ (Salaar) . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), శృతిహాసన్ (Shruti Haasan) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతోంది. తాజా షెడ్యూల్ లో పాల్గొనేందుకు ఇవాళ ముంబైలో ల్యాండ్ అయింది శృతిహాసన్. సెట్స్ లోకి రాగానే అభిమానులు, ఫాలోవర్లలో జోష్ నింపేందుకు చిన్న వీడియో క్లిప్ ను ట్విటర్ లో పోస్ట్ చేసింది. సలార్ సెట్స్ లో నా ఫేవరేట్ డైరెక్టర్లలో ఒకరైన ప్రశాంత్ నీల్ సార్ ను బాధిస్తూ..అంటూ ట్వీట్ చేసింది.
శృతిహాసన్ చేష్టలతో పక్కనే చేతిలో మైకు పట్టుకున్న ప్రశాంత్ నీల్ నవ్వడం చూడొచ్చు. శృతిహాసన్ చిలిపి చేష్టలను ప్రశాంత్ నీల్ కూడా తెగ ఎంజాయ్ చేసినట్టు వీడియో చూస్తే తెలిసిపోతుంది. సలార్ సెట్స్ లో డైరెక్టర్, హీరోయిన్ ఫన్ టైం వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.ఆగస్టులో సుమారు 10 రోజులపాటు హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేశారు. మిగిలిన భాగాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు శ్రమిస్తోంది ప్రశాంత్ నీల్ టీం.
2022 ఏప్రిల్ 14న విడుదల కానుంది సలార్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న సలార్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!