మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంది శృతిహాసన్. ఎలాంటి భేషజాలకు తావులేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే తన నైజమని అంటోందామె. ప్రస్తుతం సమాజంలో సంకుచిత ధోరణులు పెరిగిపోయాయని..ఎలాంటి పరిణామాలు ఎదురైనా తాను మాత్రం నిజాలే మాట్లాడుతానని చెప్పింది. ‘సెలబ్రిటీలు ఏం మాట్లాడినా అపార్థం చేసుకుంటారు. విషయాల్ని వక్రీకరించడం నేడు సర్వసాధారణమైపోయింది. మనం ఏం చెప్పినా విమర్శించాలనుకునే వారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి వ్యక్తుల గురించి నేను అస్సలు పట్టించుకోను. భావప్రకటన విషయంలో ఎదుటి వారి స్వేచ్ఛను నేను గౌరవిస్తాను. అదే విధంగా నా అభిప్రాయాల్ని కూడా గౌరవించాలనుకుంటా. నిర్మాణాత్మకమైన చర్చ లేకుండా కేవలం విమర్శలతో కాలం వెళ్లదీయడం అజ్ఞానమనిపించుకుంటుంది’ అని ఘూటుగా స్పందించింది శృతిహాసన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ప్రభాస్ సరసన భారీ చిత్రం ‘సలార్’లో కథానాయికగా నటిస్తోంది.