సంగారెడ్డి : కారు అదుపుతప్పి టిప్పర్ను ఢీకొని హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
మెదక్ జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య కారులో ఉదయం పటాన్చెరుకు వచ్చాడు.
తిరుగు ప్రయాణంలో ఇస్నాపూర్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లి అవతలివైపు నుంచి వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది.
ప్రమాదంలో శంకరయ్యకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.