ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ బాగోగులే కాకుండా తోటి వారి గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చిది. కోవిడ్ నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేసి ఇతరులకు అండగా నిలవాలని సెలబ్స్ కోరుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో సోదరుడు సిద్ధాంత్ ఫొటో షేర్ చేస్తూ.. నా సోదరుడు ప్లాస్మా డొనేట్ చేశారు. మీలో కూడా ఎవరైతే కరోనా నుండి కోలుకున్నారో వారు దయచేసి ప్లాస్మా డొనేట్ చేయండని కోరింది శ్రద్ధా.
గత ఏడాది కన్నా ఈ ఏడాది కరోనా ఉదృతి ఎక్కువగా ఉంది. రోజుకు లక్షలలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మెడికేషన్కు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ క్రమంలో సెలబ్రిటీలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రజలకు అండగా నిలిచేందుకు నడుం కట్టారు. కొందరు కోట్ల రూపాయలు విరాళాలు అందించగా, మరి కొందరు వైద్యానికి కావల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..