జగిత్యాల: కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. విషయం తెలసుకున్న కొందరు పూర్వ విద్యార్థులు తమకు విద్యాబోధన చేసిన గురువులకు తమకు చేతనైనంత సాయం అందిస్తున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన గడప చంద్రశేఖర్ అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు కరోనా వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, సాయమందించాలని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో జగిత్యాల పట్టణంలోని గోవింద్ పరిధిలోగల గౌతమ్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు స్పందించారు. 2014-2015 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు చంద్రశేఖర్కు రూ.20 వేల ఆర్థిక సహాయం చేసి తమ ఔదార్యం చాటుకున్నారు. ఈమొత్తానికి సంబంధించిన చెక్కును ఆ ఉపాధ్యాయునికి అందించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..