చెన్నై: ప్రముఖ ఆటోమేకర్లు రెనాల్ట్-నిస్సార్, హ్యుండాయ్ మోటార్స్ తాత్కాలిక షట్డౌన్ ముప్పును ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయా కంపెనీల ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన, అశాంతి పెరుగుతున్నది.
కొవిడ్- అనుబంధ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోతే బుధవారం నుంచి తమిళనాడులోని అన్ని ప్రొడక్షన్ యూనిట్లలో బుధవారం నుంచి సమ్మెకు వెళతామని రెనాల్ట్-నిస్సాన్ వర్కర్స్ యూనియన్ హెచ్చరించింది. ఈ మేరకు యాజమాన్యానికి సోమవారం లేఖ సమర్పించింది.
దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు తమ ప్రొడక్షన్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు హ్యుండాయ్ మోటార్స్ ప్రకటించింది. సోమవారం సంస్థ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇద్దరు ఉద్యోగులు కొవిడ్-19తో మరణించడంతో తమ భద్రత పట్ల ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రొడక్షన్ యూనిట్ మూసివేయడానికి యాజమాన్యం అంగీకరించిందని హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఈ ముథుకుమార్ చెప్పారు.
భారీ స్థాయిలో కొవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో వివిధ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పలు కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
గత వారం తమిళనాడులో ఒకరోజూ 30 వేల పై చిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్ డెట్రాయిట్గా తమిళనాడుకు పేరుంది. దేశ ఆటో హబ్గా ప్రఖ్యాతి పొందిన తమిళనాడులో లాక్డౌన్ అమలులో ఉన్నా ఆటోమొబైల్ సంస్థల కార్యకలాపాలను అనుమతినిస్తున్నారు.
రెనాల్ట్-నిస్సాన్ ఉద్యోగుల సమ్మె హెచ్చరికల నేపథ్యంలో సోమవారం జరిగిన విచారణలో తాము కొవిడ్-19 సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటిస్తున్నామని ఆ సంస్థ యాజమాన్యం.. రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. అయినప్పటికీ ఉద్యోగులు, వర్కర్ల ఆరోగ్యానికి పెద్ద పీట వేయాలని న్యాయస్థానం సూచించింది.
ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును తమకు అనుకూలంగా మార్చుకోవద్దని రెనాల్ట్-నిస్సాన్ను హెచ్చరించింది. ప్రొడక్షన్ యూనిట్లో తక్కువ సిబ్బందిని మాత్రమే అనుమతించాలని, ఎగుమతి లక్ష్యాల సాధన కోసం మాత్రమే కార్లు ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది.
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
కరోనాపై మాటల్లోనే భయం.. చేతల్లో లేదు
తృణమూల్ పద్మవ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
చోక్సీ కొత్త ఎత్తు.. అంటిగ్వా నుంచి క్యూబాకు మకాం మార్పు!
టాటా స్టీల్ మహా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్రశంసల జల్లు
కరోనా నుండి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్
గంటకు రూ.75 కోట్లు పెరిగిన గౌతం ఆదానీ సంపద!
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాం.. అనుమతించండి మోదీజీ – విస్మయం కలిగిస్తున్న పత్రికా ప్రకటన