‘హిందీ సినీరంగంలో తొలితరం కథానాయకుడిగా, దాదాసాహెబ్ఫాల్కే అవార్డు గ్రహీతగా భారతీయ సినిమాపై చెరగని ముద్రవేశారు తెలంగాణ ప్రాంతానికి చెందిన పైడి జయరాజ్. అలాంటి మహనీయుడి చరిత్ర గురించి తెలుగు చిత్రసీమకు ఎక్కువగా తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఆయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం’ అన్నారు మంత్రి శ్రీనివాస్గౌడ్. అలనాటి బాలీవుడ్ దిగ్గజం పైడి జయరాజ్ 112వ జయంతి వేడుకలు మంగళవారం జైహింద్గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగాయి. ఈ వేడుకకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జయరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పైడి జయరాజ్ జయంతి వేడుకల్ని ప్రతి ఏడాది జైహింద్ గౌడ్ అద్భుతంగా జరుపుతున్నారు. జయరాజ్ జ్ఞాపకార్థం రవీంద్రభారతిలో ఆయన పేరు మీద ప్రభుత్వం పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ను ఏర్పాటు చేసింది. జైహింద్గౌడ్ కోరినట్లు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో ఆయన ఆయన విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అన్నారు. మూకీల సమయంలోనే అగ్రహీరోగా పేరు తెచ్చుకున్నన పైడి జయరాజ్ జీవితం అందరికి ఆదర్శప్రాయమని, ఆయన విగ్రహాన్ని ఛాంబర్ ఆవరణలో లేదా ఫిలిం నగర్లో ఏర్పాటు చేయాలని మంత్రిగారిని కోరుతున్నానని నటుడు జైహింద్ గౌడ్ పేర్కొన్నారు.