మోహన్కృష్ణ, వర్ష విశ్వనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఘరానా మొగుడు’. రాజుబాబు దర్శకుడు. మోహనకృష్ణ నిర్మాత. బుధవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జెమిని సురేష్ కెమెరా స్విఛాన్ చేయగా, సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ‘చిరంజీవి టైటిల్తో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ సినీ దర్శకుడి జీవనగమనానికి చక్కటి దృశ్యరూపమిది. ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కన్న అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ మిళితమై సాగుతుంది’ అని తెలిపారు. కథను హీరోగా నమ్మి ఈ సినిమా చేస్తున్నామని మోహనకృష్ణ అన్నారు. రావురమేష్, జీవీ సుధాకర్నాయుడు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఘనశ్యామ్.