దొరసాని సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక (Shivatmika Rajasekhar). ప్రస్తుతం కలర్ స్వాతి నటిస్తోన్న ‘పంచతంత్రం’ చిత్రంలో కీ రోల్ చేస్తోంది శివాత్మిక. అయితే గోల్డెన్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయిందని ఫిలింనగర్ లో ఇపుడు జోరుగా టాక్ నడుస్తోంది. సూపర్ హిట్ మలయాళం సినిమా కప్పెలను తెలుగు (Kappela remake)లో రీమేక్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సిద్దు జొన్నల గడ్డ, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
డెబ్యూ డైరెక్టర్ చంద్రశేఖర్ టీ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జులైలో ఈ మూవీ లాంఛ్ అయింది. శివాత్మిక ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయిందట. ముందుగా శివాత్మిక పేరు వినిపించగా..ఆ తర్వాత మలయాళ నటి అనికా సురేంద్రన్ ను మేకర్స్ ఫైనల్ చేశారు. ప్రస్తుతం తెలుగులో ప్రవీన్ సత్తారు డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా అక్కినేని నాగార్జున చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది అనికా సురేంద్రన్. క్వీన్ వెబ్ సిరీస్ లో టీనేజ్ జయలలిత పాత్రలో నటించి అందరినీ మెప్పించింది అనికా సురేంద్రన్.
మరోవైపు పలు తమిళ, మలయాళ ప్రాజెక్టులతో బిజీగా ఉంది అనికా సురేంద్రన్. కప్పెన రీమేక్ కు స్వీకర్ అగస్తీ మ్యూజిక్ డైరెక్టర్. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన కప్పెన చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి హిట్టు కొట్టింది. మహ్మద్ ముస్తాఫా దర్వకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కగా..రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. మరి తెలుగు రీమేక్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?