‘మా’ ఎన్నికల (MAA elections) కౌంటింగ్ కొనసాగుతుంది. తొలుత ఈసీ సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కాగా మా’ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. ప్రకాశ్ రాజ్ (Prakash Raj)ప్యానెల్ నుంచి మొదట శివారెడ్డి (Siva Reddy) గెలుపొందారు. తాజా అప్ డేట్ ప్రకారం ఇప్పటివరకు నలుగురు ప్రకాశ్ రాజ్ ఈసీ సభ్యులు గెలిచారు. శివారెడ్డితోపాటు కౌశిక్, యాంకర్ అనసూయ, సురేశ్ కొండేటి విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి 12 మంది లీడ్ లో ఉన్నట్టు సమాచారం. మరోవైపు మంచు విష్ణు (Manchu Vishnu) ప్యానెల్ నుంచి ఆరుగురు లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
మురళీమోహన్, మోహన్ బాబు, శివకృష్ణ, జీవిత రాజశేఖర్, నరేశ్ సమక్షంలో ‘మా’ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీరితోపాటు ప్రెసిడెంట్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారు. మా ఓటర్లు 905. పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 665 ఓట్లు పోలయ్యాయి. మా ఎన్నికల్లో 60 మంది ఆర్టిస్టులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. ఈ సారి గతంలో లేనంతగా అత్యధికంగా 75 శాతం పోలింగ్ నమోదైంది.
ఇవి కూడా చదవండి..
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Vijay Devarakonda: తిరుమలలో ఫ్యామిలీతో ప్రత్యక్షం అయిన విజయ్ దేవరకొండ