హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలంతా ఇంట్లోనే ఉండి నవమి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. రామచంద్రుడి కరుణ, ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని ఆకాంక్షించారు.
కరోనా మహమ్మారి నుంచి దేశానికి, రాష్ట్రానికి విముక్తి కలగాలని శ్రీసీతారామచంద్ర స్వామిని ప్రార్థించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఒక్కరూకొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా బారి నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి