బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పా శెట్టి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న శిల్పా 2016 నుండి రియాలిటీ షో సూపర్ డాన్సర్ 4కి జడ్జిగా వ్యవహరిస్తుంది.అయితే రాజ్కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పాఈ షోకి గైర్హాజరు కావడంతో సంగీత బిజ్లానీ, జాకీ ష్రాఫ్, టెరెన్స్ లూయిస్, సోనాలి బింద్రే, మౌషుమి ఛటర్జీ, కరిష్మా కపూర్, జెనీలియా దంపతులు అతిథులుగా వచ్చారు.
సూపర్ డాన్సర్ 4 యొక్క తదుపరి ఎపిసోడ్లో, ఇండియన్ ఐడల్ విజేత సహా ఫైనలిస్టులు ప్రత్యేకంగా కనిపిస్తారని అంటున్నారు. ఇండియన్ ఐడల్ 12 విజేత పవణ్దీప్ రాజన్ మరియు ఇతర ఫైనలిస్టులు – అరుణిత కంజిలాల్, సాయిలీ కాంబ్లే, మొహమ్మద్ డానిష్, నిహాల్ టౌరో మరియు షణ్ముఖప్రియ కూడా ఇందులో భాగం కానున్నారు. అయితే మూడు వారాల తర్వాత చాలా ధైర్యం కూడగట్టుకొని వచ్చినట్టు చెబుతున్నారు.
మూడు వారాల తరువాత వచ్చిన శిల్పా శెట్టిని సూపర్ డాన్సర్ బృందం ఆప్యాయంగా స్వాగతించింది. వారి ఆప్యాయతను చూసి శిల్పా శెట్టి భావోద్వేగానికి గురి అయిందని అంటున్నారు. అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో, ఆమె సహ-న్యాయమూర్తి అనురాగ్ బసు శిల్ప గైర్హాజరు గురించి మాట్లాడుతూ మా టీమ్ ఆమెను తీవ్రంగా మిస్ అవుతున్నామని చెప్పిన విషయం తెలిసిందే.