బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఒకప్పుడు తెలుగు, హిందీ భాషలలో ఎంతగా అలరించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శిల్పా.. ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో నటించగా ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత నాగార్జునతో ‘ఆజాద్’లో, మెహన్బాబుతో ‘వీడెవడండి బాబు’, బాలకృష్ణతో ‘భలేవాడివి బాసు’ వంటి చిత్రాలు చేసింది. పెళ్లి తర్వాత కాస్త సినిమాలు తగ్గించిన శిల్పా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్లో ఉంటుంది.
ఇప్పుడు మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాతో శిల్పా శెట్టి రీఎంట్రీ ఇస్తుందనే టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో సీనియర్ స్టార్స్కు ఓ పవర్ ఫుల్ రోల్ ఇవ్వనున్న త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ 28వ సినిమాలో శిల్పాశెట్టిని పిన్ని పాత్రలో చూపించనున్నాడట. ఈ పాత్ర సినిమాకు చాలా కీలకంగా మారుతుందని అంటున్నారు. కాగా, గతంలో నదియా, ఖుష్బూ, దేవయాని, టబులని తన సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం ఎంపిక చేశాడు త్రివిక్రమ్. 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్- మహేష్ కాంబినేషన్లో మూవీ వస్తుండడంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.