డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆశాభావం
హైదరాబాద్: రష్యా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీని భారత్లో వినియోగించేందుకు రెండు, మూడు వారాల్లో భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉన్నదని ఈ వ్యాక్సిన్ను మనదేశంలో ఉత్పత్తి చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ తెలిపింది.
‘అతి త్వరలోనే స్పుత్నిక్-వీకి అనుమతి వచ్చే అవకాశం ఉన్నది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్. మొదటి డోసు వేసిన 21వ రోజు రెండో డోసు వేయాలి. 28 నుంచి 42 రోజుల్లో శరీరంలో కరోనాను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి’ అని రెడ్డీస్ ల్యాబ్స్ సీఈవో దీపక్ సప్రా తెలిపారు.
రష్యా, భారత్, యూఏఈ తదితర దేశాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో కరోనాను నిరోధించటంలో ఈ వ్యాక్సిన్ 91.6 శాతం కచ్చితత్వాన్ని చూపిందని చెప్పారు.
మోటార్ ఫీల్డ్కు జంట సవాళ్లు: కండక్టర్ల కొరత+చిప్ల ధరలు పైపైకి..!!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!