కోల్కతా : పశ్చిమ బెంగాల్కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్ (73) కరోనా వైరస్కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోల్కతాలోని ప్రభుత్వ దవాఖానలో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గోసాబా స్థానం నుంచి ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన తర్వాత జయంత్ నాస్కర్ కరోనా బారిన పడ్డారు. నాస్కర్ ఇతర శారీరక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. జయంత్ నాస్కర్ను తొలుత కోల్కతాలోని బంగూర్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ 11 రోజుల చికిత్స తర్వాత ఒక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయారు. జయంత్ నాస్కర్ గత నెల రోజులుగా కరోనా వైరస్ సోకి బాధపడుతున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా అతడి ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా అతడి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది.
జయంత్ నాస్కర్ 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ టికెట్పై గెలిచారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. జయంత్ నాస్కర్ జీవించి ఉండగానే తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంలో ఆయన చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. కాగా, ఖర్దా అసెంబ్లీ సీటు నుండి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాజల్ సిన్హా కూడా కరోనా బారిన పడి మరణించారు. రెండు స్థానాలు ఖాళీ కావడంతో త్వరలో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
రిగ్గింగ్ జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన టీఎంసీ అభ్యర్థులు
రామ మందిరం విషయంలో మా ఎంపీవన్నీ అబద్దాలే
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్లో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్కు 134 ఏండ్లు
ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!
చరిత్రలో ఈరోజు : హిందుత్వానికి ప్రతీకగా శివసేన ఆవిర్భావం
కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..